మన శాస్త్రవేత్తలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మన శాస్త్రవేత్తలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, సెప్టెంబర్ 2012, సోమవారం

మన శాస్త్రవేత్తలు -ఆంటోనీ లెవోషియర్‌...








ఆధునిక రసాయన శాస్త్రానికి ఆద్యుడు

    మంట... నీరు... గాలి... వీటి గురించి 

కొత్త విషయాలెన్నో చెప్పాడు! ఆధునిక రసాయన 

శాస్త్రానికి పితామహుడుగా గుర్తింపు పొందాడు! ఆయనే 

ఆంటోనీ లెవోషియర్‌... పుట్టిన రోజు 1743 ఆగస్టు 26న.


మంట అంటే ఏమిటో, దహనంలో జరిగే చర్య ఏమిటో 

అప్పటికి తెలీదు. నీరు ఒక మూలకం అనుకునే రోజులవి. 

గాలిలో ఏమేమి ఉంటాయో చెప్పలేని స్థితి. వాటిని 

పరిశోధించి రసాయన శాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించిన 

ఫ్రెంచి శాస్త్రవేత్త ఆంటోనీ లెవోషియర్‌. 


పారిస్‌లో 1743 ఆగస్టు 26న సంపన్న కుటుంబంలో 

పుట్టిన ఆంటోనీ లారెంట్‌ డి లెవోషియర్‌ చిన్నప్పుడే తల్లిని 

కోల్పోయాడు. న్యాయవాది అయిన తండ్రి కోరికపై 

న్యాయశాస్త్రాన్ని చదివినా, ఆపై భూగర్భ శాస్త్రంపై దృష్టి 

పెట్టాడు. పాతికేళ్లకే ఫ్రెంచ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో చేరి 

డైరెక్టర్‌గా ఎదిగిన ఇతడు, మరో వైపు పన్నులు వసూలు 

చేసే కంపెనీని స్థాపించాడు. ఇన్ని వ్యాపకాల మధ్య కూడా 

పరిశోధనలు కొనసాగించడం విశేషం.

అప్పటి సిద్ధాంతాల ప్రకారం మండే వస్తువుల్లో 'ఫోజిస్టాన్‌

అనే పదార్థం ఉంటుందని నమ్మేవారు. దహనచర్యలో 

భాగంగా వస్తువులు ఆ పదార్థాన్ని 

కోల్పోతాయనుకునేవారు. లెవోషియర్‌ తన ప్రయోగాల 

ద్వారా గాలిలోని ఆక్సిజన్‌ వల్లనే దహనం 

సాధ్యమవుతుందని నిరూపించాడు. అలాగే గాలిలో ఏఏ 

వాయువులు కలిసి ఉంటాయో చాటి చెప్పాడు. ఆయనకు 

ముందు 2000 సంవత్సరాల నాటి నుంచే నీరనేది ఒక 

మూలకమని భావించేవారు. ఆ దశలో హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ 

వాయువుల ద్వారా ప్రయోగశాలలో నీటిని తయారు చేసి 

లెవోషియర్‌ సంచలనం సృష్టించాడు. ఇంకా వజ్రాలనేవి 

కార్బన్‌ యొక్క స్ఫటిక రూపాలేనని నిరూపించాడు. 

తూనికలు, కొలతల విషయంలో ఉపయోగపడే మెట్రిక్‌ 

పద్ధతి రూపకర్త కూడా ఆయనే. ప్రయోగశాలలో రసాయన 

పదార్థాల చర్యలను, వాటి ఫలిత పదార్థాలను కచ్చితంగా 

కొలవడం ద్వారా 'ద్రవ్య నిత్యత్వ సూత్రం' (Law of 

Conservation of Mass) ఆవిష్కరణకు 

దోహదపడ్డాడు..

దహనచర్యపై తన సిద్ధాంతాన్ని జీవుల శ్వాసక్రియకు 

ఆపాదించడం ద్వారా జీవశాస్త్రంలో కూడా కొత్త వివరాలు 

చోటు చేసుకున్నాయి. ఆయన రచించిన 'ది ఎలిమెంటరీ 

ట్రీటైజ్‌ ఆన్‌ కెమిస్ట్రీ' ఓ ప్రామాణిక గ్రంథంగా

 గుర్తింపు పొందింది.

ఫ్రెంచి విప్లవం తర్వాత అధికారం చేపట్టిన ప్రభుత్వ 

అధికారుల్లో ఒకరు రాసిన రసాయన గ్రంథాన్ని పాఠ్య 

పుస్తకంగా అంగీకరించలేదన్న కక్షతో ఆయనపై తప్పుడు 

అభియోగాలు మోపి శిరచ్ఛేద శిక్ష విధించడం ఆ దేశ 

చరిత్రలో ఒక మాయని మచ్చ.


'ఆయన తల తీయించడానికి ఒక క్షణం పట్టింది కానీ

అలాంటి మరో తల రావాలంటే యుగాలు పడుతుంది' అని 

శాస్త్రరంగం నివాళులు పొందిన శాస్త్రవేత్త ఆయన.

1, ఆగస్టు 2012, బుధవారం

అమెడో అవొగాడ్రో








సమగ్రమైన అధ్యయనం ద్వారా శాస్త్రవేత్త అవొగాడ్రో ఓ సిద్ధాంతాన్ని ప్రకటించాడు. అది ఆయన కాలంలో ఆదరణకు నోచుకోలేదు. తర్వాతి కాలంలో అదెంత కీలకమైనదో తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆయన పేరును ఓ స్థిరాంకానికి పెట్టి నివాళులు అర్పించారు. ఉపయోగపడుతున్న ఆ స్థిరాంకం 'అవగాడ్రో సంఖ్య'.
ఆయన పుట్టినరోజు -- 1776 ఆగస్టు 9న .


'
విశ్వంలో ఒకే రకమైన పీడనం, ఉష్ణోగ్రతలు ఉండే సమాన ఘనపరిమాణం ఉన్న ఏ రెండు వాయువుల్లోనైనా సమాన సంఖ్యలో అణువులు ఉంటాయి'- ఇదే విజ్ఞానశాస్త్రంలో ప్రసిద్ధిపొందిన అవగాడ్రో నియమం (Avogadro Law). రసాయన శాస్త్రంలోను, వివిధ వాయువుల ధర్మాల నిర్ణయంలోను ఎంతో కీలకమైనదిగా ఈనాటికీ ఉపయోగపడుతున్న ఈ సిద్ధాంతాన్ని అవగాడ్రో 1811లో ప్రపంచానికి అందించాడు.

ఇటలీలోని ట్యూరిన్‌లో 1776 ఆగస్టు 9న న్యాయవాదుల కుటుంబంలో పుట్టిన అవగాడ్రో చురుకైన విద్యార్థి. పదహారేళ్లకే పట్టభద్రుడై, ఇరవై ఏళ్లకల్లా చర్చికి సంబంధించిన న్యాయశాస్త్రంలో డాక్టరేట్‌ సాధించాడు. న్యాయవాద వృత్తిని స్వీకరించి ఆర్థికంగా ఎదిగి సుఖవంతమైన జీవనంలో స్థిరపడినా సంతృప్తి చెందలేదు. తిరిగి భౌతిక, రసాయనిక, గణిత శాస్త్రాలను కొత్తగా అధ్యయనం చేయసాగాడు. ఇరవై నాలుగేళ్ల వయసులోనే విద్యుత్‌ రంగంలో ప్రయోగాలు చేశాడు. ఆపై రాయల్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా నియమితుడయ్యాడు.మూలకాల సాపేక్ష అణుభారాలను భాష్పసాంద్రతల నుంచి కనుగొనడం, వాయు సమ్మేళనాల్లో అణువుల నిష్పత్తిని కనుగొనడంలో ఈ సిద్ధాంతం ఉపయోగపడుతుంది. పరమాణువుల కలయిక వల్ల అణువులు ఏర్పడతాయని కూడా అవగాడ్రో ప్రతిపాదించగలిగాడు. అలాగే నీరు ఒక ఆక్సిజన్‌ పరమాణువు, రెండు హైడ్రోజన్‌ పరమాణువుల సంయోగంతో ఏర్పడుతుందని నిర్ధరించాడు. అయితే ఈయన సిద్ధాంతాలను అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. ఆయన మరణించిన నాలుగేళ్లకు అణు, పరమాణు భారాల వివరణలో తలెత్తిన చిక్కుముడులను అవగాడ్రో నియమాన్ని అన్వయించుకోవడం ద్వారా శాస్త్రవేత్తలు అర్థం చేసుకోగలిగారు. అందుకు గుర్తింపుగా పదార్థంలోని ప్రాథమిక కణాలను లెక్కించే ప్రమాణమైన మోల్‌ (mole) సూచించే సంఖ్య (6023 తర్వాత 20 సున్నాలు)ను అవగాడ్రో సంఖ్యగా గుర్తించారు. డజను అనేది 12 సంఖ్యను సూచించినట్టే మోల్‌ అనేది ఈ పెద్ద సంఖ్యను సూచిస్తుంది. అలాగే చంద్రునిపై ఉండే ఓ క్రేటర్‌కి కూడా ఆయన పేరే పెట్టారు.

16, మే 2012, బుధవారం

మన శాస్త్రవేత్తలు-9 (ఆర్యభట్టు)


 



ఆర్యభట్టు భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ  శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభటీయం, ఆర్య సిధ్ధాంతం, గోళాధ్యాయం మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం లో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్ లను ఇతను "జ్యా" మరియు      "కొ జ్యా" గా నిర్వచించాడు.

భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు కానీ అతని వాదనని అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా కొంత మంది గ్రహణం సమయంలో భోజనం చెయ్యరు, గర్భిణి స్త్రీలని ఇంటి బయటికి రానివ్వరు. ఆర్య భట్ట బోధనలు గ్రీక్ శాస్త్రవేత్తలని కూడా ప్రభావితం చేసాయి. భూమి నీడ చంద్రుని మీద గోళాకారం(elliptical shape)లో పదుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీక్ శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్య భట్ట సిధ్ధంతాల ఆధారంగానే. కానీ అప్పట్లో ప్రజలలో ఈ సిధ్ధాంతాలని నమ్మేంత జ్ఞానం వృధ్ధి చెందలేదు.

ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయం లో నిర్వచించాడు.  అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. సూర్య గ్రహణాల ను ఖచ్చితంగా లెక్క కట్టాడు.
భూమి తన చుట్టూ తాను తిరగటానికి (పరిభ్రమణం) పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులు గా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది.
భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (
ఆర్యభట్టు ) పెట్టారు.


ఆర్యభట్టు యొక్క జన్మ సంవత్సరం ఆర్యభట్టీయంలో స్పష్టంగా ఉదహరించబడింది కానీ ఈయన పుట్టిన ప్రదేశం యొక్క ఉనికి గురించి మాత్రం పండితులలో ఏకాభిప్రాయం లేదు. కొంతమంది పండితులు ఆర్యభట్టు నర్మాద, గోదావరి మధ్య ప్రాంతమైన అస్మకలో పుట్టాడని నమ్ముతారు. వీరి దృష్టిలో అస్మక మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ లో భాగమైన మధ్య భారతదేశం. తొలి బౌద్ధ గ్రంథాలు అస్మక మరింత దక్షిణాన ఉన్న దక్కన్ ప్రాంతమని వర్ణిస్తున్నాయి. అయితే ఇతర గ్రంథాలు అస్మక ప్రజలు అలెగ్జాండర్ పై పోరాడారని ప్రస్తావిస్తున్నవి. అదే నిజమైతే అస్మక మరింత ఉత్తరాన ఉండి ఉండాలి.

7, మే 2012, సోమవారం

మన శాస్త్రవేత్తలు -8 (ఆంటోని ల్యూవెన్‌ హక్‌)


ఆంటోని ల్యూవెన్‌ హక్‌

Antony van Leeuwenhoek (1632-1723)

(అక్టోబరు 24, 1632)




 . . my work, which I've done for a long time, was not pursued in order to gain the praise I now enjoy, but chiefly from a craving after knowledge, which I notice resides in me more than in most other men. And therewithal, whenever I found out anything remarkable, I have thought it my duty to put down my discovery on paper, so that all ingenious people might be informed thereof.
Antony van Leeuwenhoek. Letter of June 12, 1716

సూక్ష్మలోకం చూపించినవాడు! బుట్టలల్లి జీవించే కుటుంబంలో పుట్టాడు... చదువుసంధ్యలు పెద్దగా లేవు... చిన్న వ్యాపారంతో ఉపాధి మొదలెట్టాడు... అలాంటి వ్యక్తి శాస్త్రవేత్త అయి అంతవరకూ తెలియని  లోకాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడని వూహించగలమా? అతడే - ఆంటోనీ ల్యూవెన్‌ హోక్‌. 'మైక్రోస్కోప్‌'ను కనిపెట్టినవాడు.
Description: https://sites.google.com/site/seshagirirao2006/_/rsrc/1287994948478/home/antony-van-leeuwenhoek-antoni-lyuven-hok/Antony%20van%20Leeuwenhoek.jpg
హాలెండ్‌లోని డెఫ్ట్‌లో 1632 అక్టోబరు 24న బుట్టలు అల్లుకుని జీవించే కుటుంబంలో పుట్టిన ఆంటోనీ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. కుటుంబంతో ఆమ్‌స్టర్‌డామ్‌ నగరానికి వెళ్లిన అతడు ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా చేరాడు. వివాహానంతరం డెఫ్ట్‌ తిరిగి వచ్చి స్వంతంగా చిన్న బట్టల దుకాణాన్ని 
ప్రారంభించాడు. ఆరోజుల్లో ఉండే భూతద్దాల పట్ల ఆకర్షితుడై రకరకాల కటకాల తయారీలో ప్రయోగాలు చేసేవాడు. అలా సున్నితమైన కటకాలను రూపొందించి ఒక స్టాండుకు బిగించి మొట్టమొదటి సరళ సూక్ష్మదర్శిని (simple microscope)ని తయారు చేయగలిగాడు.
కంటికి కనిపించని వాటిని కూడా చూపించే సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్‌) ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీవ శాస్త్ర పరిశోధనలు, వైద్యరంగంలో రోగనిర్దారణ పరీక్షలు సహా అనేక రకాలుగా ఉపయోగపడుతున్న ఈ పరికరాన్ని కనిపెట్టడం ద్వారా 'మైక్రో బయాలజీ' అనే కొత్త శాస్త్ర అధ్యాయానికి తెర తీసిన వ్యక్తిగా ఆంటోనీ ల్యూవెన్‌ హోక్‌ పేరొందాడు. స్వయంగా తయారు చేసుకున్న మైక్రోస్కోపుల సాయంతో ప్రపంచంలోనే తొలిసారిగా ఏకకణ జీవుల్ని, సూక్ష్మజీవుల్ని, చర్మ నిర్మాణం, రక్తనాళికల్లో రక్త ప్రవాహం సహా అనేకదృశ్యాలను చూడగలిగాడు.


ఆ మైక్రోస్కోపుతో అన్నింటినీ పరిశీలించడమే అతడి పనిగా మారింది. ఒక దశల ఇరుగుపొరుగువారు అతడిని పిచ్చివాడిగా జమకట్టారు. ఆ పరిశీలనల వల్ల అతడు చర్మంపై స్వేదగ్రంథులను, జంతువుల కళ్లను, వెంట్రుకలను, కీటకాల నోటి భాగాలను ఇలా ఎన్నో గమనించి నోట్స్‌ రాసుకున్నాడు. మురికి నీటిలో సూక్ష్మజీవుల్ని తొలిసారిగా చూసి, వాటి జీవన విధానాన్ని పరిశీలించాడు. తన వేలిని సూదితో గుచ్చుకుని రక్తాన్ని పరిశీలించి రక్తకణాలను చూడగలిగాడు. ఈ పరిశీలనలను లండన్‌లోని రాయల్‌ సొసైటీకి పంపేవాడు. మొదట్లో నమ్మని అక్కడి శాస్త్రవేత్తలు ఆ తర్వాత అతడి పరిశోధనలు ఎంత విలువైనవో గ్రహించారు. అతడిని 'ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ'గా గుర్తించారు. ఇతడిని కలుసుకోడానికి రష్యా పాలకుడు పీటర్‌ ది గ్రేట్‌, బ్రిటన్‌ రాణివంటి ప్రముఖులు వచ్చి మైక్రోస్కోపు చూసి ఆశ్చర్యపడేవారు.

ఆంటోనీ సరళ సూక్ష్మదర్శిని తర్వాత సంయుక్త సూక్ష్మదర్శిని (compound microscope)గా రూపాంతరం చెందింది. దాని ద్వారా సూక్ష్మ జీవుల్ని 2500 రెట్లు పెద్దవిగా చూడగలిగారు. ఇప్పుడు లక్షరెట్లు పెద్దవిగా చూపించే ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపులు ఉన్నాయి.